కర్నూలు, అక్టోబర్ 16: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్నూలు పర్యటనలో శ్రీశైల మల్లన్నా క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
మోదీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మల్లికార్జున స్వామికి పంచామృతంలో రుద్రాభిషేకం నిర్వహించగా, భ్రమరాంబ దేవికి ఖడ్గమాల మరియు కుంకుమార్చన పూజలు చేశారు. పూజల అనంతరం ప్రధాన మంత్రి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఇక్కడ శివాజీ దర్బార్ హాల్ మరియు ధ్యాన మందిరాలను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఆయనతో కలిసి శ్రీశైలాన్ని చేరి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.





















