అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా కదిలి 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ కారణంగా ఏపీ వ్యాప్తంగా వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇవాళ ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు


















