డల్లాస్లో ఈరోజు నుంచి ప్రారంభం కానున్న మంత్రి నారా లోకేష్ గారి పర్యటనకు సంబంధించి తుదిదశ ఏర్పాట్లు చర్చించేందుకు తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు ప్రవాసాంధ్ర తెలుగుదేశం కార్యకర్తలు సమావేశమయ్యారు. లోకేష్ గారి సందర్శన విజయవంతం కావాలంటే అందరూ ఏకగ్రీవంగా సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. ఈ పర్యటనపై ప్రవాస తెలుగు ప్రజల్లో పెద్దఎత్తున ఉత్సాహం నెలకొంది.




















