దుబాయ్: భారత్ అదరహో.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై మళ్లీ మనదే ఆధిపత్యం. ఆసియా కప్ 2025 (Asia Cup 2025)లో భాగంగా దాయాది జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ను 127/9కే కట్టడి చేసింది. కుల్దీప్ యాదవ్ (3/18), అక్షర్ పటేల్ (18/2), బుమ్రా (28/2) బంతితో అదరగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ (47*; 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అదరగొట్టాడు. తిలక్ వర్మ (31; 31 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ (31; 13 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు) క్రీజులో ఉన్నంతసేపు బౌండరీలతో అలరించాడు. శుభ్మన్ గిల్ (10) తక్కువస్కోరుకే వెనుదిరిగాడు. శివమ్ దూబె (10*) నాటౌట్గా నిలిచాడు. గ్రూప్ ఏలో వరుసగా రెండో విజయం అందుకున్న భారత్.. తదుపరి మ్యాచ్లో ఒమన్తో (సెప్టెంబరు 19న) తలపడనుంది.
పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్ (40; 44 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. షాహీన్ అఫ్రిది (33*; 16 బంతుల్లో 4 సిక్స్లు) చివర్లో మెరుపులు మెరిపించాడు. ఫకార్ జమాన్ (17), ఫహీమ్ అష్రఫ్ (11), ముఖీమ్ (10) పరుగులు చేశారు. భారత బౌలర్ల ధాటికి సైమ్ అయుబ్, మహ్మద్ నవాజ్ డకౌట్ కాగా.. హసన్ నవాజ్ (5), మహ్మద్ హారిస్ (3), సల్మాన్ అఘా (3) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.




















