కార్తీక మాసం ముగింపు సందర్భంగా పోలీ పాడ్యమి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామునే పవిత్ర స్నానాలు చేసి, ప్రత్యేక పూజలు ఆచరించారు. అనంతరం అరటి తొక్కలలో (డొప్పలలో) దీపాలను పెట్టి నీటిలో ప్రవాహంలో వదిలారు. దీంతో చెరువులు, నదులు దీపాల వెలుగుతో అందంగా మెరవుతున్నాయి. స్థానిక శివాలయాలు భక్తులతో రద్దీగా కిటకిటలాడుతున్నాయి.




















