అమరావతి: రాష్ట్ర సచివాలయంలో ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గనుల శాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమీక్షలో రాష్ట్రంలో అమలు అవుతున్న ఉచిత ఇసుక విధానంపై కూడా చర్చ జరిగింది.
ఈ సమీక్షకు మంత్రి కొల్లు రవీంద్ర, గనుల శాఖ ఉన్నతాధికారులు ముఖేష్ కుమార్ మీనా, ప్రవీణ్ కుమార్, అలాగే ఆర్టీజీ అధికారులు హాజరయ్యారు. అధికారులు వివరించినట్లుగా, 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గనుల శాఖ ద్వారా రూ.3,320 కోట్ల ఆదాయ లక్ష్యం నిర్ణయించబడింది.
ప్రభుత్వం తీసుకున్న పారదర్శక, సమర్థవంతమైన చర్యల కారణంగా గతం కంటే 34 శాతం ఎక్కువ ఆదాయం గనుల శాఖ ద్వారా లభిస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యంగా మాంగనీస్ వంటి ప్రధాన ఖనిజాల ఉత్పత్తిలో 72 శాతానికి పైగా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని వివరించారు.






















