ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుంపుల గ్రామం వద్ద మానేరు వాగుపై ఉన్న చెక్ డ్యామ్ను దుండగులు కూల్చివేశారు. దీంతో నీరు దిగువకు వెళ్తోంది. శుక్రవారం రాత్రి దుండగులు చెక్డ్యామ్ను కూల్చివేసినట్లు అధికారులు భావిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకుని నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించారు. వాగులోని ఇసుకను అక్రమ రవాణా చేసేందుకే దుండగులు ఈ పనికి ఒడిగట్టారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో చెక్ డ్యామ్కు చెందిన 3 ప్యానళ్లు ధ్వంసం అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల రూ.23 కోట్లకుపైగా నిధులతో ఈ చెక్ డ్యామ్ నిర్మాణం చేపట్టారు.


















