రాంచీలో సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో గెలిచిన భారత జట్టు (Team India) ఇప్పుడు రెండో వన్డే కోసం సన్నద్ధమవుతోంది. ఈ రెండో మ్యాచ్ రాయ్పుర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగనుంది.
భారత జట్టు సోమవారం సాయంత్రం రాయ్పుర్కు చేరగా, హోటల్లోకి వెళ్లే ముందు చిన్నారులు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)ని ఉత్సాహంగా ఆతిథ్యమిచ్చారు. కోహ్లీని చూసి సంబరపడిన పిల్లలు, ఎర్ర గులాబీలు ఇచ్చి స్వాగతం పలికారు. విరాట్ కూడా నవ్వుతూ వాటిని స్వీకరించి నెమ్మదిగా ముందుకు కదిలాడు. ఈ అందమైన క్షణం సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.




















