తమిళ నటుడు జయం రవి (Jayam Ravi) బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శనంలో తన స్నేహితురాలు కెనీషా (Kenishaa)తో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పురోహితులు వారికి ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా, గతేడాది జయం రవి తన భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విడాకుల కేసు కోర్టులో కొనసాగుతోంది.




















