శ్రీకాకుళం: కాషీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన stampede ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. ఈ ఘటనలో గాయపడిన భక్తులకు తగిన మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారని తెలిపారు.
హోంమంత్రి వివరాల ప్రకారం, ఆలయం మొదటి అంతస్తులో ఉందని, భక్తులు 20 మెట్లు ఎక్కి చేరే క్రమంలో రైలింగ్ ఊడటంతో ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలిపారు. దాని కారణంగా ఒకరిపై ఒకరు పడిపోయి తొక్కిసలాట మొదలై ఐదుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మహిళా భక్తుల మృతి తీవ్ర బాధ కలిగిస్తుందని హోంమంత్రి తెలిపారు.
ప్రతివారం సుమారు 1,500 నుంచి 2,000 మంది భక్తులు ఆలయానికి దర్శనానికి వస్తారని, ఈ stampedeలో గాయపడ్డవారికి ప్రాణాపాయం లేదని హోంమంత్రి తెలిపారు. ఈ ఘటనతో భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్లీ కాకుండా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి ఆదేశించారు.




















