కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ ఉదయం శ్రీకాకుళం ప్రభుత్వ బాలికల కళాశాలను సందర్శించారు. అదనపు భవనాల ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదిక ఎదురుగా విద్యార్థినులు కింద కూర్చొని ఉన్న సందర్భంలో, కేంద్ర మంత్రి కూడా వారితో కలిసి నేలపై కూర్చొని ఉండి, అనంతరం విద్యార్థినులతో సరదాగా ముచ్చటించారు.


















