కర్నూలు, అక్టోబర్ 25 (పోలీసు కార్యాలయం):
కర్నూలు జిల్లా చిన్న టేకూరు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ ఘటన అక్టోబర్ 24వ తేదీ (శుక్రవారం) అర్ధరాత్రి తర్వాత చోటుచేసుకుంది.
దర్యాప్తులో బైక్ నడిపిన వ్యక్తి శివశంకర్, వెనుక కూర్చున్న వ్యక్తి ఎర్రి స్వామి @ నాని అని గుర్తించారు. ప్రాథమిక విచారణలో ఇద్దరూ లక్ష్మీపురం గ్రామానికి చెందినవారని, రాత్రి సుమారు 2 గంటల సమయంలో తుగ్గలి దిశగా బయలుదేరినట్లు తెలిసింది. ఎర్రి స్వామిని వదిలి తిరిగి రావాలని శివశంకర్ ప్రయత్నించినట్లు సమాచారం.
కియా షోరూం సమీపంలోని HP పెట్రోల్ బంక్లో రాత్రి 2.24 గంటలకు రూ.300 విలువైన పెట్రోల్ నింపినట్లు సీసీటీవీ దృశ్యాలలో గుర్తించారు. పెట్రోల్ నింపిన కొద్ది సేపటికే బైక్ (పల్సర్) చిన్న టేకూరు సమీపంలో స్కిడ్ అవడంతో డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా, ఎర్రి స్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
తర్వాత శివశంకర్కు సహాయం చేయడానికి ప్రయత్నించిన ఎర్రి స్వామి, బైక్ను రోడ్డుపైనుంచి తొలగించే క్రమంలో అక్కడికి వచ్చిన బస్సు బైక్ను ఢీకొట్టి కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. బస్సు కింద మంటలు రావడంతో భయపడి ఎర్రి స్వామి అక్కడినుంచి పారిపోయి తన స్వగ్రామమైన తుగ్గలికి వెళ్లిపోయాడు.
ఈ ఘటనపై ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తదుపరి విచారణలో మరిన్ని వివరాలు వెలువడతాయని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ తెలిపారు.
— జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు


















