ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ముగిశాయి. రియాల్టీ, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు కన్జూమర్ డ్యూరబుల్స్ రంగంలో అమ్మకాల ఒత్తిడి సూచీలపై ప్రతికూల ప్రభావం చూపింది. అంతేకాక, గత కొన్ని రోజులుగా గరిష్ఠ స్థాయిల వద్ద ఉన్న స్టాక్లపై మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో సూచీలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిఫ్టీ మిడ్క్యాప్ మరియు స్మాల్క్యాప్ సూచీలు ఈరోజు ఫ్లాట్గా ముగిశాయి.
సెన్సెక్స్ ఉదయం 84,625.71 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు: 84,778.84) నష్టంతో ప్రారంభమై, కొద్దిసేపటి లాభాల తర్వాత మళ్లీ నష్టాల్లోకి జారింది. ఇంట్రాడేలో కనిష్ఠం 84,219.39 పాయింట్ల వద్ద తాకిన సూచీ చివరికి 150.68 పాయింట్ల నష్టంతో 84,628.16 వద్ద ముగిసింది. నిఫ్టీ 29.85 పాయింట్ల నష్టంతో 25,936.20 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 88.27గా నమోదైంది.
సెన్సెక్స్ 30లో ట్రెంట్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి. టాటా స్టీల్, ఎల్అండ్టీ, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాలు సాధించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ 64 డాలర్ల వద్ద ట్రేడవుతోంది, గోల్డ్ ఔన్సు ధర 3906 డాలర్ల వద్ద ఉంది.




















