సామర్లకోట: కాకినాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం పనసపాడులో బాలిక (17)ను హతమార్చి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గొల్లప్రోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక, యువకుడ అశోక్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి పనసపాడులోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం వద్దకు బాలికను అశోక్ తీసుకెళ్లాడు. అక్కడ బ్లేడుతో ఆమె గొంతుకోసి హతమార్చాడు. అనంతరం వేట్లపాలెం సమీపంలో రైలు కిందపడి అశోక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.



















