తిరుమలలో భక్తుల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. ఉచిత దర్శనం కోసం భక్తులు సుమారు 24 కంపార్ట్మెంట్ల వరకు క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. సర్వదర్శనం కోసం దాదాపు 12 గంటలు పడుతుండగా, రూ.300 శీఘ్రదర్శనానికి వచ్చిన భక్తులు 3 నుంచి 4 గంటల్లో స్వామివారిని దర్శించుకుంటున్నారు. సర్వదర్శనం టోకెన్ ఉన్నవారికి కూడా సుమారు 4–6 గంటల సమయం అవసరమవుతోంది. నిన్న ఒక్క రోజే 62,129 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, 21,026 మంది తలనీలాలు సమర్పించారని దేవస్థానం తెలిపింది. హుండీ ద్వారా నిన్న వచ్చిన ఆదాయం మాత్రం భారీగా ₹4.13 కోట్లకు చేరుకుంది.



















