తితిదే మాజీ ఏవీఎస్వో సతీష్కుమార్ మృతిని హత్యగా నిర్ధారించిన అనంతపురం గుత్తి జీఆర్పీ పోలీసులు, మృతుని బంధువుల ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.
ఫిర్యాదులో, పరకామణిలో డాలర్ల చోరీ కేసు నిందితులే సతీష్కుమార్ను హత్య చేశారని పేర్కొన్నారు. పరకామణిలో చోరీ కేసులో ఫిర్యాదు చేసిన అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఏవీఎస్వో) వై. సతీష్కుమార్ శుక్రవారం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు. తిరుపతిలో సీఐడీ విచారణకు హాజరయ్యేందుకు రైలులో బయలుదేరిన ఆయన, మార్గమధ్యంలో మృతదేహంగా గుర్తించబడ్డారు.
ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో సీఐగా పనిచేస్తున్న సతీష్కుమార్ గతంలో తితిదే ఏవీఎస్వోగా విధులు నిర్వహించారు. పరకామణి కేసులో ఈ నెల 6న సీఐడీ విచారణకు హాజరయ్యారు. శుక్రవారం మళ్లీ విచారణకు రావాల్సి ఉండడంతో గురువారం అర్థరాత్రి గుంతకల్లు నుంచి రైలులో తిరుపతికి బయలుదేరారు. అయితే తాడిపత్రి మండలం కోమలి రైల్వే స్టేషన్ దగ్గర పట్టాల పక్కన ఆయన శవం శుక్రవారం ఉదయం కనిపించింది.




















