శివ కార్తికేయన్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పరాశక్తి’. రవి మోహన్, అథర్వ కీలక పాత్రల్లో నటించారు. చిత్రీకరణ ఇప్పటికే పూర్తి కాగా, సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలుత జనవరి 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన చిత్రబృందం, ఇప్పుడు విడుదల తేదీని ముందుకు జరిపింది.తాజాగా విడుదల చేసిన వీడియో ద్వారా ‘పరాశక్తి’ జనవరి 10న తమిళం, తెలుగులో ఒకేసారి విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఆకాశ్ భాస్కరన్కు చెందిన డాన్ పిక్చర్స్ రూ.150 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించింది.విడుదల తేదీ మారడంతో తమిళ బాక్సాఫీస్లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో విజయ్ నటించిన ‘జన నాయగన్’ జనవరి 9న విడుదల కానుండగా, దానికి మరుసటి రోజే ‘పరాశక్తి’ రావడం చర్చనీయాంశమైంది. మరోవైపు తెలుగులో సంక్రాంతి పండగకు వరుసగా పెద్ద సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో థియేటర్ల లభ్యత సమస్యగా మారుతుందని భావించిన చిత్రబృందం, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.




















