నగరంలోని మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దమ్మాయిగూడకు చెందిన మీన్రెడ్డి అనే ఆటో డ్రైవర్ మంగళవారం సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు చిక్కాడు. పరీక్షలో 120 రీడింగ్ రావడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
అర్ధరాత్రి సమయంలో కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ వద్ద మీన్రెడ్డి పెట్రోల్ పోసుకుని తనపై నిప్పంటించుకున్నాడు. మంటలు ఆర్పేందుకు స్థానికులు, ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నించినప్పటికీ, ఆస్పత్రికి తరలించే లోపే అతడు మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
పోలీసుల దురుసు ప్రవర్తన వల్లే మీన్రెడ్డి ఈ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.


















