హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో గుర్తు తెలియని వ్యక్తులు దాదాపు రెండు వేల నాటుకోళ్లను వదిలివెళ్లారు. సిద్దిపేట–ఎల్కతుర్తి రహదారి సమీపంలోని పొలాల్లో కోళ్లను విడిచిపెట్టడంతో, వాటిని పట్టుకోవడానికి స్థానికులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అందినంతవరకు పట్టుకొని ఇళ్లకు తీసుకెళ్లారు. అయితే ఇంత పెద్ద సంఖ్యలో నాటుకోళ్లను ఎవరు, ఏ కారణంతో వదిలారో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.




















