మొదటి భాగం 1/25
దక్షిణ భారత దేశంలో మధురకు ముపై మైళదూరంలో,తిరుచ్చు అనే గ్రామం వుంది. నేడు ఆ గ్రామం,రామనాథపురం జిల్లాలో వుంది. “తిరుచ్చు?” అంటే, ఓంకారమనిఅర్థం. స్కంధ పురాణంలో, ఆ గ్రామాన్ని త్రిశూలపురం” అన్నారు.ఆగ్రామంలో ఒక శైవ దేలవాయం వుంది. అందు పార్వతి, సహాయాంబగాను, పరమేశ్వరుడు – భూమినాథేశ్వరుడుగాను అవతరించినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ దివ్యమూర్తులను “మాణిక్యవాచకర్, సుందరమూర్తి” అనే.. ఇద్దరు ఋషి కవులు స్తుతించినట్లు,పెరియ పురాణంలో వుంది. పూర్వం ఆ గ్రామంలో క్షామం వచ్చినప్పుడు, కౌండిన్యుడు శివునిగూర్చి తపస్సు చేయగా, ఒకనది ఉద్భవించినట్లు, ఒక గాథ వుంది, కరువు నివారణ అయింది.అంచేత ఆ నదికి “కౌండిన్యనది” అని పేరు వచ్చింది.
పందొమ్మిదో శతాబ్దం నాల్గవ పాదంలో తిరుచ్చుశి గ్రామంలో “సుందరమయ్యర్ – అలఘమ్మ” అనే స్మార్త శాఖకు చెందిన ద్రావిడ బ్రాహ్మణ దంపతులున్నారు. వారు దైవభక్తులై, పవిత్ర వన్దులై కాలం గడిపేవారు. అలఘమ్మకు ఎన్నో స్తోత్రాలూ, గీతాలూ వచ్చు. ఆచారవంతురాలు. ఆమె ఉపదేశం కూడా పొందిది. సుందరమయ్యర్ నెలకు రెండు రూపాయలు జీతం మీద, గుమాస్తాపని చేస్తో, ఊళ్లోవాళ్ళకు దస్తావేజులూ అవీ రాసి పెడుతూ, మంచి మాటకారితనంతో, వ్యవహారదక్షతతో అందరికీ తలలో నాలుక మాదిరిగా మెలుగుతూ, తన తెలివితేటలతో పరీక్ష రాయ కుండా, పట్టా లేని ప్లీడరుగా ప్రభుత్వ అనుమతిమీద స్థానిక మెజి స్ట్రేట్ కోర్టులో పనిచేస్తూ, ఇంటా- బైటా మంచివాడనే పేరు తెచ్చు కున్నాడు. అతడు బీదసాదలకు, సాధు సజ్జనులకు అతిథి సత్కారాలు చేసేవాడు. క్రమంగా అతడు కొంతడబ్బు కూడబెట్టి, తిరుచ్చుళ్లిలో ఒక ఇల్లు కట్టాడు
1879 – డిశంబరు 30వ తేదీరాత్రి ఒంటిగంట వేళ, అంటేప్రమాది సంవత్సర, మార్గశీర్షమాస, పునర్వసు నక్షత్రమందు అలఘమ్మ గర్భాన ఒక మగశిశువు జన్మించాడు. అది ఆ ర్ణా నక్షత్రదర్శన పుణ్యదినం. పరమేశ్వరుడు, బ్రహ్మ విష్ణువులకు జ్యోతిరూపంలో దర్శనమిచ్చిన పర్వదినమది. ఆ రోజున పరమేశ్వరుడుకరుణా స్వరూపుడై గౌతమ, పతంజలి, వ్యాఘ్ర పాదాది మొద లైనమహర్షులకు చిదంబరంలో నటరాజై దర్శనమిచ్చిన పుణ్యదినం. ఆశుభసమయాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం భక్తులుఆనందతాండవమూర్తిని మహా వైభవంతో ఊరేగిస్తారు. ఆ రోజు నతిరుచ్చుశిలో ఈశ్వరోత్సవం ముగిసి, స్వామి గర్భాలయం ప్రవేశించేప్పుడు, అలఘమ్మ ప్రసవించింది.
ఆ దంపతులకు అది ద్వితీయ సంతానం. పెద్దవాని పేరు,నాగస్వామి. వారిది తెలుగు సంప్రదాయం. పూర్వం ఆ వంశంలోతెలుగు విద్వాంసులు వున్నారు. వారు తండ్రిని “నాయనా” అనిపిలిచేవారు. సుందరమయ్యర్ కులదైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామి కావడం చేత, ఆ బిడ్డకు ‘వెంకట్రామన్ ‘ అని పేరు పెట్టారు.ఆ తర్వాత ఆ దంపతులకు “నాగ సుందరం” అనే కొడుకూ, “అలిమేలు” అనే కూతురూ, కలిగారు. వెంకట్రామన్ పిల్లలందరిమాదిరిగాపెరిగినా అతనిలో చురుకుదనంతక్కువ, నిద్ర ఎక్కువగా ఉండేది.అయినా అతడు పిల్లలతోకలిసి భూమినాథేశ్వరస్వామి ఆలయంప్రక్కనవున్న కళ్యాణమండపంలోనో, కౌండిన్యనదీతీరంలోనో ఆటలాడుకునేవాడు. అతనికి ఎనిమిదవఏట, శాస్త్రోక్తంగా ఉపనయనంచేశారు.
సుందరమయ్యర్ పెద్ద తమ్ముడు సుబ్బయ్యర్, దిండిగల్లులోసబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో హెడ్ గుమాస్తాగా పని చేసేవాడు
1891లో నాగస్వామి చదువు నిమిత్తం పినతండ్రి దగ్గరకు వెళ్లాడు.మరికొన్నాళ్ళు తర్వాత తిరుచ్చుళిలో వెంకట్రామన్ ప్రాథమికచదువు పూర్తికావడంతో, అతడు కూడా దిండిగల్లు వెళ్ళాడు.
సుబ్బయ్యర్ తన కొడుక్కి పుట్టినరోజు పండగ చేసుకుని,ఆ రాత్రి వెంకట్రామన్ని ఇంట్లో ఉంచి, అందరూ ఆలయానికివెళ్లారు. వారు తిరిగి ఇంటికి వచ్చేప్పటికి, వెంకట్రామన్ ఇంటితలుపులూ, కిటికీలూ అన్నీ మూసేసి నిద్రపోయాడు. వాళ్లు ఎంతఅరచి, పిలిచి, తలుపులు బాదినా, అతనికి మెలకువ రాలేదు.చివరికి ఒకరు గోడ దూకి, లోపలకు వెళ్లి తలుపులు తెరచినా,అతనికి మెలకువ రాలేదు.
వెంకట్రామన్ నిద్రావస్థ చాలా చిత్రమైనది. అతనితోఆటల్లో గాని, దెబ్బలాటల్లోగాని గెలవలేనివాళ్లు, అతడు నిద్రపోతున్నప్పుడు బాగా కొట్టిపోయేవారు. లేదా, అతనిముఖానికి మసిపూసేవారు, ఏం చేసినా, అతనికి మెలకువ వచ్చేది కాదు. “ఆరకమైన నిద్ర, మంచి ఆరోగ్య లక్షణం. అది “సోమ్నాంబులిజం”కాదు కాని, అది కొంతవరకు, సమాధి స్థితిని పోలివుంటుంది,” అనిఅన్నారు భగవాన్.
1891 లో సుబ్బయ్యరు మధుర బదిలీ అయింది. ఆయనతుటుంబంతో పాటు, నాగస్వామి, వెంత ట్రామన్ కూడా మధురవెళ్లారు. అక్కడ వెంకట్రామన్ మిడిల్ స్కూల్లో చేరాడు.
1892 – ఫిబ్రవరి 18వ తేదీన సుందరమయ్యర్ అకస్మాత్తుగా మరణించాడు. అప్పటికి నాగసుందరానికి ఆరేళ్లు.అలమేలు పసిపిల్ల. అలఘమ్మ ఆ పిల్లలిద్దర్నీ తీసుకుని “మానామధుర” లో ఉంటున్న, చిన్న మరది నెల్లియప్పయ్యర్ ఇంటికివెళ్ళింది.
వెంకట్రామన్ ఫోర్తు ఫారమ్ చదివేందుకు, అమెరికన్ మిషన్హైస్కూల్లో చేరాడు. అతనికి చదువు మీద కన్నా, ఆటలమీదఆసక్తి మెండు. కాస్తసమయం చిక్కి తేచాలు, మిత్రులతో కలిసి”వైఘ” నదిలో ఈతలు కొట్టేవాడు. లేదా, దగ్గరలో ఉన్న కొండలుఎక్కేవాడు. చెట్లమీద నుంచీ, గుట్టల మీద నుంచి దూకే ఆటలుఆడేవాడు. కు స్త్రీలు పట్టేవాడు. అతనికి “ఫుట్ బాల్ ” ఆట అంటే,అమితమైన ఇష్టం. అన్ని ఆటట్లో అతనిదే గెలుపు. అయినా అతనుచదువుల్లో సూక్ష్మ గ్రాహే కాదు. ఏకసంధాగ్రాహి కూడాను. అతనుఅన్నింటిలోనూ సమర్ధుడు కావడంతో. అందరూ అతన్ని“తంగ క్కై” అంటే, “సువర్ణహ స్తం,” అని పిలిచేవారు.
తరువాతి కధనం రేపటి భాగం లో ………



















