వరుసగా వివాహేతర సంబంధాలతో తనకు చెడ్డపేరు తీసుకొస్తోందని ఆగ్రహించిన ఓ తండ్రి తన కుమార్తెను హతమార్చిన ఘటన తేని జిల్లాలో చోటుచేసుకుంది. మార్కండయన్కోట ప్రాంతానికి చెందిన ప్రవీణ విభేదాల కారణంగా భర్తను వదిలి పదేళ్లుగా మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది.చెన్నై: వరుసగా వివాహేతర సంబంధాలతో తనకు చెడ్డపేరు తీసుకొస్తోందని ఆగ్రహించిన ఓ తండ్రి తన కుమార్తెను హతమార్చిన ఘటన తేని జిల్లాలో చోటుచేసుకుంది. మార్కండయన్కోట ప్రాంతానికి చెందిన ప్రవీణ(Praveena) విభేదాల కారణంగా భర్తను వదిలి పదేళ్లుగా మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో, తిరుప్పూర్కు చెందిన మరో వ్యక్తితో ప్రవీణకు వివాహేతర సంబంధం ఏర్పడింది.ఈ విషయంపై ఆమెను తండ్రి తంగయ్య పలుమార్లు మందలించాడు. అయినా అతడి మాటల్ని ఆమె పట్టించుకోలేదు.. దీంతో ఆగ్రహం చెందిన తండ్రి, శీతలపానీయంలో విషం కలిపి ప్రవీణకు తాగించి, ఆమె స్పృహతప్పిన సమయంలో చీరతో గొంతు నులిమి హతమార్చాడు. ఈ విషయం ఎవరికి తెలియకుండా కుమార్తె మృతదేహాన్ని గ్రామ శివారులో పడవేశాడు. పోలీసుల విచారణలో… కుమార్తెను తానే హతమార్చినట్లు తంగయ్య అంగీకరించడంతో అతడిని గురువారం రాత్రి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.




















