తాడేపల్లి: మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం కుంచనపల్లిలో శ్రీ గంగా, శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వేశ్వరస్వామివార్ల ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆలయ ప్రాంగణానికి చేరుకున్న నారా లోకేష్కు గ్రామస్థులు, ఆలయ పునఃనిర్మాణ అభివృద్ధి కమిటీ సభ్యులు బాణసంచా కాల్చి, పూలదండలతో ఘన స్వాగతం పలికారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ మంత్రి నారా లోకేష్ కమిటీ సభ్యులతో కలిసి ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన చేశారు. అనంతరం ధాన్యాదివాసం వద్ద స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ పునఃనిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన నారా లోకేష్, గ్రామ ప్రజలతో పాటు కమిటీ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
✨ ఈ శంకుస్థాపనతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

























