అమరావతి, అక్టోబర్ 22: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెట్టుబడుల సాధన లక్ష్యంతో మూడు రోజుల యూఏఈ పర్యటనకు బయలుదేరారు. ఉదయం అమరావతి నుంచి హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని, 10 గంటలకు యూఏఈకు బయలుదేరారు.
ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీలు కానున్నారు. విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులను ఆహ్వానిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు యూఏఈలో మూడు రోజులపాటు వివిధ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు, వన్-టు-వన్ భేటీలలో పాల్గొంటారు.
పర్యటనలో ముఖ్యంగా దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియంకు సైట్ విజిట్ కూడా ఏర్పాటు చేశారు. తొలి రోజు భాగంగా శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు ఉంటాయి.
ముఖ్యమంత్రి రాత్రి సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొని, నవంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. పర్యటన ముగింపులో, దుబాయ్లో AP NRT ఆధ్వర్యంలో తెలుగు డయాస్పోరా సమావేశంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు.
ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, పారిశ్రామిక అవకాశాలు మరియు తెలుగు డయాస్పోరా తో సంబంధాలను బలపరచడం ప్రధాన లక్ష్యం.



















