ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడమే ప్రధాన లక్ష్యంగా రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి Anagani Satya Prasad తెలిపారు. ఇందులో భాగంగా 1.90 లక్షల ఎకరాల “చుక్కల భూములకు” త్వరలోనే విముక్తి కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు.
సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, గత రెండేళ్లలో రెవెన్యూ శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలు ప్రజల విశ్వాసాన్ని తిరిగి పెంపొందించాయని చెప్పారు. భూములు, రిజిస్ట్రేషన్లు, రీసర్వే ప్రక్రియల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవస్థను సులభతరం చేసినట్లు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో భూముల యాజమాన్య హక్కులపై అనిశ్చితి ఏర్పడిందని, దాన్ని తొలగించి స్పష్టత తీసుకొచ్చామని అన్నారు.
ప్రభుత్వం చేపట్టిన “రీసర్వే 2.0” ద్వారా ఇప్పటివరకు 4,331 గ్రామాల్లో రీసర్వే పూర్తయ్యిందని మంత్రి తెలిపారు. భూ హక్కుదారుల నుంచి ఈ-కేవైసీ తీసుకున్న తర్వాతే పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తున్నామని చెప్పారు. దీనివల్ల భూ వివాదాలు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు.
అన్సెటిల్డ్ ఎస్టేట్, ఇనామ్ భూముల సమస్యలను పరిష్కరించి, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో 120 ఏళ్లుగా ఉన్న సమస్యను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. శెట్టిపల్లి ప్రాంతంలో 2,111 మందికి భూ హక్కులు కల్పించామని చెప్పారు. గ్రామ సర్వీస్ ఇనామ్ భూముల పరిష్కారంతో 1.33 లక్షల ఎకరాలు విడుదల చేసినట్లు వివరించారు.
గతంలో జారీ చేసిన పాస్బుక్లలో హక్కుదారుల పూర్తి వివరాలు లేకపోవడాన్ని సరిచేసి, ఇప్పుడు రాజముద్ర, ఫోటో, ఖాతా నంబర్, క్యూఆర్ కోడ్ వంటి 12 భద్రతా లక్షణాలతో కొత్త పాస్బుక్లు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు 28 లక్షల పాస్బుక్లు జారీ చేసినట్లు చెప్పారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసి, స్లాట్ బుకింగ్ విధానం ద్వారా కేవలం 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తవుతోందని మంత్రి పేర్కొన్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం కలెక్టర్లకు ఇచ్చామని, అవసరమైతే గత రిజిస్ట్రేషన్లను కూడా రద్దు చేసే విధానం తీసుకురానున్నామని తెలిపారు.
గ్రామ కంఠాల్లో ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించామని, ఫ్రీహోల్డ్ భూముల సమస్యలపై ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా సమీక్ష కొనసాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో భూముల మార్కెట్ ధర పెంపు ప్రతిపాదన ప్రస్తుతం లేదని స్పష్టం చేశారు.
పెట్టుబడుల ప్రోత్సాహానికి భాగంగా సంస్థలకు 99 పైసలకే భూములు కేటాయిస్తున్నామని మంత్రి తెలిపారు. పర్యాటక ప్రాజెక్టులకు 476 ఎకరాలు, మౌలిక సదుపాయాల కోసం 12,042 ఎకరాలు, పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల కోసం 40,000 ఎకరాలు గుర్తించినట్లు వివరించారు.
ఈ సమావేశంలో సీసీఎల్ఏ జయలక్ష్మి, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఐజీ బి.ఆర్. అంబేడ్కర్ తదితరులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















