స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధన, పదిసూత్రాల అమలుపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విస్తృత సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎస్ కె. విజయానంద్తో పాటు జలవనరులు, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఆర్థిక, వైద్యారోగ్య, రవాణా, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, పురపాలక, ఐటీ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు’ విధానంతో పౌరులకు వేగంగా, మెరుగైన పాలన అందించే కార్యాచరణపై చర్చించారు. సుస్థిరాభివృద్ధి, శాఖల మధ్య సమన్వయం, తక్కువ వ్యయంతో ఇంధనం–విద్యుత్–రవాణా–నీటి భద్రత కల్పన, జీరో పావర్టీ, మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగాల సృష్టి, సాంకేతికత మేళవింపు వంటి అంశాల ఆధారంగా స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన ప్రణాళికలను సమావేశంలో ఖరారు చేశారు.



















