స్కాంద పురాణంలో ఒక చక్కని శ్లోకం ఉంది.
అశ్వత్థమేకం పిచుమందమేకం
న్యగ్రోధమేకం దశ తిన్త్రిణీకం|
కపిత్థ బిల్వాఁ మలకత్రయాంచ
పంచామ్ర వాపీ నరకన్ న పశ్యేత్||
అశ్వత్థ = రావి, (100% కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది)
పిచుమందా = నిమ్మ, (80% కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది)
న్యగ్రోధ = మర్రి చెట్టు, (80% కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది)
తింత్రిణి = చింత, (80% కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది)
కపిత్థ = వెలగ, (80% కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుంది)
బిల్వ = మారేడు, (85% కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుంది)
అమలకా = ఉసిరి, (74% కార్బన్ డయాక్సైడ్ గ్రహిస్తుంది)
ఆమ్రాహ్ = మామిడి, (70% కార్బండయాక్సైడ్ గ్రహిస్తుంది)
వాపి = నుయ్యి
ఈ చెట్లను చెప్పిన సంఖ్యలో నాటి ఒక దిగుడు బావి నిర్మించి సంరక్షించినవారు నరకం చూడవలసిన అవసరం ఉండదు. (ప్రస్తుత కలుషిత వాతావరణమే.. ఆ నరకం)
ఈ నిజమైన విషయాలను పాటించకపోవడం వల్లే ఈరోజు వాతావరణంలో నరకాన్ని చూస్తున్నాం.
రావి, మోదుగ, వేప వంటి మొక్కలు నాటడం ఆగిపోవడంతో కరువు సమస్య పెరుగుతోంది. ఈ చెట్లన్నీ వాతావరణంలో ఆక్సిజన్ను పెంచుతాయి. అలాగే, ఇవి భూమి ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి.
ఈ చెట్లను పూజించే సంప్రదాయాన్ని మూఢ నమ్మకాలుగా భావించి, ఈ చెట్లను దూరం చేసుకుని రహదార్లకు ఇరువైపులా గుల్మోహర్, యూకలిప్టస్ (నీలగిరి) చెట్లను నాటడం ప్రారంభించాం.
యూకలిప్టస్ త్వరగా పెరుగుతుంది, కానీ ఈ చెట్లు చిత్తడి నేలను ఆరబెట్టడానికి నాటబడతాయి. ఈ చెట్ల వల్ల భూమిలో నీటి మట్టం తగ్గుతుంది.
గత 40 ఏళ్లలో యూకలిప్టస్ చెట్లను విరివిగా నాటడం వల్ల పర్యావరణం దెబ్బతింది.
గ్రంథాలలో, రావి చెట్టుని చెట్లరాజు అని పిలుస్తారు.
“పత్రే పత్రే సర్వదేవయం వృక్ష రాజ్ఞో నమోస్తుతే||”
మూలంలో బ్రహ్మ, కాండములో విష్ణువు, శాఖలలో శంకరుడు, ఆకులలో సర్వ దేవతలు నివసిస్తారు… అటువంటి వృక్షరాజం రావికి నమస్కారాలు అని చెప్పబడినది.
తులసి మొక్కలను ప్రతి ఇంటిలో నాటాలి.
భవిష్యత్తులో మనకు సహజ ప్రాణవాయువు సమృద్ధిగా అందేలా ప్రచారం ప్రారంభించాల్సిన అవసరం ఉంది.
రావి, మఱ్ఱి, మారేడు, వేప, ఉసిరి మరియు మామిడి మొక్కలు నాటడం ద్వారా రాబోయే తరానికి ఆరోగ్యకరమైన మరియు ప్రకాశవంతమైన పర్యావరణాన్ని అందించడానికి ప్రయత్నిద్దాం.




















