ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ జిలాయ్ సాకి, జేమ్స్ కుక్ యూనివర్సిటీ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో భేటీ అయ్యారు. ప్రస్తుతం సింగపూర్లో క్యాంపస్ను నిర్వహిస్తున్న జేమ్స్ కుక్ యూనివర్సిటీ (JCU)ని ఉద్దేశిస్తూ… ఆంధ్రప్రదేశ్ యువత కోసం పర్యావరణం, ఆరోగ్య సంరక్షణ, సస్టయినబుల్ టూరిజం రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. 1057 కిలోమీటర్ల సువిశాల తీరం ఉన్న ఏపీలో, మారిటైమ్ (సముద్ర), తీర ప్రాంత పరిశోధనలకు ఏపీ వర్సిటీలతో కలిసి పనిచేయాలని కోరారు. అలాగే, గ్రామీణ ఏపీలో ట్రోపికల్ వ్యాధులు, పాండమిక్ ప్రిపేర్డ్నెస్పై ఉమ్మడి పరిశోధనలు, గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా టెక్నాలజీ, పాలసీ రిసెర్చ్కి సహకారం అందించాలని కోరారు. చివరగా, వ్యవసాయ, పట్టణ నీటి అవసరాల కోసం జలవనరుల నిర్వహణలో నైపుణ్యం కోసం ఏపీతో కలిసి ట్రోఫికల్ వాటర్ రిసెర్చ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ప్రతిపాదించారు.




















