భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తల్లాడ మండలం కలకొడిమ గ్రామంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం వ్యసనంతో కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన కొడుకుపై విసుగు చెందిన తండ్రి, కూల్డ్రింక్లో పురుగుమందు కలిపి ఇచ్చాడు.
వివరాల ప్రకారం, ఆదూరి రాజేష్ కుమారుడు ఆదూరి నాగరాజు (18) మద్యానికి బానిసై ఇంట్లో గొడవలు పెట్టేవాడు. ఎన్నిసార్లు మందలించినా మార్పు రాకపోవడంతో రాజేష్ కోపంతో నాగరాజుకు కూల్డ్రింక్లో పురుగుమందు కలిపి ఇచ్చాడు.
అందులో విషం ఉందని తెలియని నాగరాజు దానిని తాగి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, గత పది రోజులుగా చికిత్స పొందుతున్న అతను సోమవారం మృతి చెందాడు.
ఈ ఘటనపై మృతుడి బంధువులు తండ్రి రాజేష్పై తల్లాడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.




















