పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ నిర్ణయం వల్ల గల్ఫ్ ప్రాంతం నుంచి ప్రపంచ దేశాలకు జరిగే ఇంధన సరఫరాకు ఆటంకాలు ఏర్పడే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణించే చమురు ట్యాంకర్లకు అవసరమైతే అమెరికా నేవీ భద్రత కల్పిస్తుందని ఆయన ప్రకటించారు. ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థలో ఎలాంటి అంతరాయం కలగకుండా అమెరికా అవసరమైన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.ఈ విషయాన్ని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో చేసిన పోస్ట్లో వెల్లడించారు. ప్రపంచ మార్కెట్లలో చమురు సరఫరా సాఫీగా కొనసాగేందుకు అమెరికా ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.
ఇక గల్ఫ్ ప్రాంతం మీదుగా సముద్ర మార్గాల్లో జరిగే వాణిజ్యానికి ఆర్థిక భద్రత కల్పించేందుకు కూడా చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో యూఎస్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్కు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. సముద్ర మార్గాల్లో వాణిజ్యానికి తక్షణం బీమా సౌకర్యాలు, ఆర్థిక గ్యారెంటీలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు వెల్లడించారు.ప్రపంచ చమురు రవాణాలో హర్మూజ్ జలసంధి కీలక మార్గంగా భావించబడుతుంది. ఈ మార్గం మూసివేత లేదా భద్రతా సమస్యలు తలెత్తితే అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై భారీ ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















