పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో China ఇరాన్కు రహస్యంగా సహాయం చేస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.అమెరికా సైనిక స్థావరాలు, ఆయుధ నిల్వలు, యుద్ధ విమానాలు, విమానవాహక నౌకల కదలికలు, సైనిక మోహరింపులు వంటి వాటిని నిరంతరం పర్యవేక్షించడానికి చైనా టెక్ కంపెనీలు ఏఐ సాంకేతికత, ఓపెన్ సోర్స్ డేటాను వినియోగిస్తున్నాయి.
ఉపగ్రహ చిత్రాలు, ఫ్లైట్ ట్రాకర్లు, నౌకా రవాణా సమాచారం మరియు కృత్రిమ మేధ వినియోగించి, అమెరికా సైన్యాన్ని గమనిస్తున్నట్లు కొన్ని సంస్థలు పేర్కొన్నాయి. ఈ సమాచారాన్ని చైనా ప్రైవేట్ కంపెనీలు ఇరాన్ సైనిక ఉన్నతాధికారులకు అందిస్తున్నట్లు తెలుస్తోంది.నిపుణుల ప్రకారం, ఈ నిఘా పరికరాలను ఉపయోగించి ఎవరైనా ఎక్కడి నుంచైనా విమానాల కమ్యూనికేషన్లను విశ్లేషించవచ్చు, భారీ సైనిక కదలికలను పర్యవేక్షించవచ్చు. ఈ కారణంగా అమెరికా అధికారులు మరియు నిపుణులు సమస్యను ఎలా ఎదుర్కోవాలో పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం, చైనా ప్రైవేట్ రంగ జియోస్పేషియల్ విశ్లేషణ సామర్థ్యం పెరగడంతో, ఇది కేవలం అమెరికాకు మాత్రమే కాకుండా, ప్రపంచ దేశాలకు కూడా ముప్పు కలిగించబోతోంది. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ఒకప్పుడు ప్రభుత్వాలకు పరిమితమైనప్పటికీ, AI ఆధారిత సాంకేతికత ద్వారా ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు కూడా అందుబాటులోకి వస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















