పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి దర్శకుడు హరీశ్ శంకర్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే పోస్టర్లు, పాటలతో భారీ అంచనాలు సృష్టించింది.
ఉగాది సందర్భంగా మార్చి 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు ప్రమోషన్లలో భాగంగా దర్శకుడు హరీశ్ శంకర్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రంలోని కీలక సన్నివేశాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఈ సినిమాలోని ఇంటర్వెల్ సీన్ పవన్ కల్యాణ్ కెరీర్లోనే అత్యుత్తమంగా నిలుస్తుందని చెప్పారు.
గతంలో ‘గబ్బర్ సింగ్’లో పవన్ కల్యాణ్ను చూపించిన తీరు అభిమానులకు ఎంతగా నచ్చిందో తెలిసిందే. అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో ఆయనను ఇంకా మరింత మాస్గా, పవర్ఫుల్గా చూపించే ప్రయత్నం చేశామని హరీశ్ శంకర్ వెల్లడించారు.
పవన్ కల్యాణ్పై తనకున్న అభిమానాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. “పవన్ కల్యాణ్ను వెండితెరపై అత్యంత పవర్ఫుల్గా చూపించాలనే ఒక స్వార్థం నాకుంది. ఈ సినిమా చూసిన తర్వాత పవన్ను ఇంత మాస్గా హరీశ్ శంకర్ మాత్రమే చూపించగలడని ప్రేక్షకులు చెప్పాలి” అని అన్నారు.
ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఎలాంటి కట్స్ లేకుండా చిత్రానికి యూ/ఏ (U/A) సర్టిఫికేట్ వచ్చినట్లు చిత్రబృందం వెల్లడించింది.
మొత్తానికి భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా పవన్ అభిమానులకు మాస్ ఎంటర్టైన్మెంట్గా నిలుస్తుందా లేదా అన్నది విడుదల తర్వాతే తెలుస్తుంది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNow WorldNews



















