భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అఫ్గానిస్థాన్తో జరగనున్న వన్డే సిరీస్కు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తొడ కండరాల గాయం కారణంగా ఆయన సిరీస్ నుంచి వైదొలగవచ్చని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా టీమ్ఇండియా అఫ్గాన్తో మూడు వన్డేల సిరీస్ను ఆడనుంది. జూన్ 13 నుంచి జూన్ 20 వరకు ఈ సిరీస్ జరగనుంది. ఇప్పటివరకు కోహ్లీ భారత జట్టులో కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు.
ఇటీవల ముగిసిన ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఛాంపియన్గా నిలవగా, విరాట్ కోహ్లీ ఆ జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఫైనల్లో గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 75 పరుగులు నాటౌట్ చేసి జట్టుకు విజయం అందించాడు. అయితే ఆ మ్యాచ్ సమయంలో అతను గాయంతో ఇబ్బంది పడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఫిజియో సహాయంతో నొప్పిని తట్టుకుని చివరివరకు బ్యాటింగ్ చేశాడు.
ఇక రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా కూడా ఈ సిరీస్కు ఎంపికైనప్పటికీ వారి ఫిట్నెస్పై ఇంకా స్పష్టత రాలేదు. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సి ఉండగా, రోహిత్ ఇప్పటివరకు అక్కడికి వెళ్లలేదని తెలుస్తోంది. దీంతో అతని పాల్గొనడంపై అనుమానాలు కొనసాగుతున్నాయి.
అఫ్గానిస్థాన్తో షెడ్యూల్ ప్రకారం ముల్లాన్పుర్ వేదికగా ఏకైక టెస్టు ప్రారంభం కానుంది. అనంతరం జూన్ 13న ధర్మశాలలో తొలి వన్డే, జూన్ 17న లక్నోలోని ఏక్నా స్టేడియంలో రెండో వన్డే, జూన్ 20న చెన్నైలోని చెపాక్లో మూడో వన్డే జరగనుంది. టెస్టు ఉదయం 9:30 గంటలకు, వన్డేలు మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















