జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పిఠాపురంలో నిర్వహించిన సభలో పార్టీ యువజన విభాగం ‘జై కొట్టు’ లోగోను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ జనసేన కార్యకర్తలను ఉద్దేశించి ఆడియో సందేశం ఇచ్చారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ‘చెయ్యెత్తి జై కొట్టు’ అనే నినాదం జనసైనికుల్లో ఎంతో స్ఫూర్తిని నింపుతుందని అన్నారు. ఆ స్ఫూర్తిని యువతలో మరింతగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పవన్ కల్యాణ్ ‘జై కొట్టు’ లోగోను రూపొందించారని తెలిపారు.
రాజకీయాల్లో యువతకు ప్రత్యేక స్థానం కల్పించాలనే ఉద్దేశంతోనే జనసేన యువజన విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. యువత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రజా సమస్యలపై స్పందించాలని సూచించారు. కేవలం అరుపులు, కేకలు చేయడం కాకుండా క్రమశిక్షణతో పనిచేయడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు.
పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చే ఆదేశాలను ప్రతి జనసైనికుడు క్రమశిక్షణతో పాటించాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ‘జై కొట్టు’ విభాగం పనిచేస్తుందని తెలిపారు.
పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలకు పిఠాపురం వేదిక కావడంతో జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘జై కొట్టు’ లోగో ఆవిష్కరణతో సభలో ఉత్సాహం నెలకొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















