ఏపీ మెగా డీఎస్సీ-2025 ఫలితాలు, ఎంపికల ప్రక్రియ నేపథ్యంలో హారిజాంటల్ రిజర్వేషన్ విధానం చర్చనీయాంశంగా మారింది. కొందరు అభ్యర్థులు ఎంపికల్లో అన్యాయం జరిగిందని ఆరోపించగా, ప్రభుత్వం మాత్రం హారిజాంటల్ రిజర్వేషన్ విధానంపై సరైన అవగాహన లేకపోవడమే ఈ అపోహలకు కారణమని చెబుతోంది.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు గత ప్రభుత్వం 2023 ఆగస్టు 2న జీవో నెం.77ను జారీ చేసి హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి అన్ని నియామకాల్లో ఇదే విధానం కొనసాగుతోంది.
వర్టికల్ రిజర్వేషన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వంటి సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు అమలవుతాయి. హారిజాంటల్ రిజర్వేషన్లో మహిళలు, దివ్యాంగులు, క్రీడాకారులు, మాజీ సైనికోద్యోగులకు ప్రత్యేక రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఈ విధానంలో ముందుగా మెరిట్ ఆధారంగా ఎంపికలు జరుగుతాయి. హారిజాంటల్ కోటా అభ్యర్థులు మెరిట్లోనే ఉద్యోగాలు సాధిస్తే వారికి అదనంగా ప్రత్యేక కోటా వర్తించదు. అవసరమైతే చివరి దశలో రిజర్వేషన్ శాతం పూర్తయ్యేలా సర్దుబాట్లు చేస్తారు. అందుకే కొందరికి రిజర్వేషన్ అమలుకాలేదనే భావన కలుగుతుందని అధికారులు వివరిస్తున్నారు.
డీఎస్సీలో ఓపెన్ కేటగిరీ 40%, బీసీ 29%, ఎస్సీ 15%, ఎస్టీ 6%, ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లు ఉండగా, మహిళలకు 33.3%, క్రీడాకారులకు 3%, మాజీ సైనికోద్యోగులకు 2%, దివ్యాంగులకు 4% హారిజాంటల్ రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
హారిజాంటల్ విధానం ఉద్దేశం రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం మాత్రమేనని, మెరిట్కు భంగం కలగకుండా అవకాశాలు అందించడమే దీని ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















