అంతర్జాతీయ రాజకీయాల్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)పై నియంత్రణ, ఇరాన్తో మళ్లీ సైనిక ఘర్షణలు మొదలయ్యే అవకాశాలు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.
అమెరికా సెంట్రల్ కమాండ్ ఇప్పటికే హర్మూజ్ జలసంధిని దిగ్బంధించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో ఇరాన్పై పరిమిత స్థాయిలో సైనిక దాడులను పునరుద్ధరించే ఆలోచనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారులు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ దాడులకు ట్రంప్ ఆమోదం తెలుపుతారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు.ఇరాన్ను అన్ని వైపుల నుంచి ఒత్తిడిలో పెట్టి, హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం సాధించాలన్నది అమెరికా వ్యూహంగా భావిస్తున్నారు. ఈ మార్గంలో నౌకల భద్రత కోసం మిత్రదేశాలతో కలిసి చర్యలు తీసుకోవడంపై కూడా చర్చలు జరుగుతున్నాయి.
ఇదే సమయంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) కూడా ఇరాన్పై దాడులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఐడీఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ట్రంప్ నిర్ణయం కోసం ఇజ్రాయెల్ ఎదురు చూస్తోందని కూడా తెలుస్తోంది. అయితే మొదటగా ఇరాన్ దాడి చేస్తే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించింది.ఇదిలా ఉండగా, శాంతి చర్చలు విఫలమయ్యేందుకు అమెరికానే కారణమని ఇరాన్ ఆరోపిస్తోంది. ఈ విషయంపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి సోషల్ మీడియాలో స్పందిస్తూ, “మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే శత్రుత్వమే మిగులుతుంది” అని వ్యాఖ్యానించారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















