బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు కేంద్రీయ ప్రభుత్వంలో స్థిరమైన ఉద్యోగం పొందే అద్భుత అవకాశం లభిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ (AIIMS) కేంద్రాలు, జిప్మర్, ఈఎస్ఐసీ తదితర ప్రముఖ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీగా నియామకాలు జరుగుతున్నాయి. నోటిఫికేషన్లో 2551 పోస్టులు ప్రకటించినప్పటికీ, కొన్ని కేంద్రాల్లో ఖాళీలు ఇంకా స్పష్టంగా వెల్లడించకపోవడంతో నియామకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ప్రిలిమ్స్ (అర్హత పరీక్ష మాత్రమే)
- మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు
- 80 ప్రశ్నలు – నర్సింగ్ సబ్జెక్ట్
- 20 ప్రశ్నలు – జనరల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్
- ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు
- తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత
- వ్యవధి: 90 నిమిషాలు (5 సెక్షన్లు – ఒక్కోటి 18 నిమిషాలు)
అర్హత మార్కులు:
- జనరల్, ఈడబ్ల్యూఎస్ – 50%
- ఓబీసీ – 45%
- ఎస్సీ, ఎస్టీ – 40%
- దివ్యాంగులకు అదనంగా 5% సడలింపు
గమనిక: ప్రిలిమ్స్ మార్కులు తుది ఎంపికలో పరిగణించరు.
మెయిన్స్ (తుది ఎంపికకు కీలకం)
- మొత్తం 160 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు (అన్నీ నర్సింగ్ సిలబస్ నుంచే)
- ప్రతి ప్రశ్నకు 1 మార్కు
- తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత
- వ్యవధి: 3 గంటలు (4 సెక్షన్లు – ఒక్కోటి 45 నిమిషాలు)
ప్రిలిమ్స్లో అర్హత సాధించిన అభ్యర్థుల్లో ఖాళీలకు 5 రెట్లు మందిని మెయిన్స్కు పిలుస్తారు.
అర్హతలు
- బీఎస్సీ నర్సింగ్ / పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్
లేదా - జీఎన్ఎంతో పాటు కనీసం 50 పడకల ఆసుపత్రిలో 2 సంవత్సరాల పని అనుభవం
వయోపరిమితి
- గరిష్ఠం 30 సంవత్సరాలు
- ఎస్సీ, ఎస్టీ – 5 ఏళ్ల సడలింపు
- ఓబీసీ – 3 ఏళ్ల సడలింపు
- దివ్యాంగులు – 10 నుంచి 15 ఏళ్ల వరకు సడలింపు
వేతనం మరియు ఇతర ప్రయోజనాలు
నర్సింగ్ ఆఫీసర్గా ఎంపికైనవారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడతారు.
- పే లెవెల్ 7 ప్రకారం మూలవేతనం: ₹44,900
- డీఏ, హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సులు కలిపి మొదటి నెల నుంచే సుమారు ₹85,000 వరకు వేతనం అందుకునే అవకాశం ఉంది.
నియామకాలు జరిగే ప్రముఖ కేంద్రాలు
దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ కేంద్రాలు — బఠిండా, భోపాల్, భువనేశ్వర్, బీబీనగర్, బిలాస్పుర్, గోరఖ్పుర్, జోధ్పుర్, కల్యాణి, మంగళగిరి, నాగ్పుర్, న్యూదిల్లీ, పట్నా, రాయ్బరేలీ, రాయ్పుర్, రాజ్కోట్, రిషికేష్ తదితర ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయి.
ఈ స్కోరుతో ఎయిమ్స్తో పాటు జిప్మర్–పుదుచ్చేరి, ఈఎస్ఐసీ వంటి సంస్థల్లో కూడా అవకాశాలు లభిస్తాయి.
సిద్ధతకు సూచనలు
- బీఎస్సీ నర్సింగ్ నాలుగేళ్ల సిలబస్ను పూర్తిగా పునర్విమర్శ చేయాలి.
- గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలు సాధన చేయాలి.
- ఎమ్మెస్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్షల ప్రశ్నలు కూడా ఉపయోగకరంగా ఉంటాయి.
- సమయపాలనపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















