Pawan Kalyan జనసేన పార్టీ స్థాపన వెనుక తన లక్ష్యం అధికారం కాదని, దేశ సమగ్రత మరియు జాతీయ శ్రేయస్సేనని స్పష్టం చేశారు. దిల్లీలో నిర్వహించిన ‘జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం’ ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.
జనసేన పార్టీకి 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా గత ప్రయాణాన్ని గుర్తు చేసుకున్న పవన్, ఎన్నో పోరాటాలు, పరాజయాలు ఎదురైనా పార్టీ తన ప్రాథమిక సిద్ధాంతాలను ఎప్పుడూ విడిచిపెట్టలేదన్నారు. మారుతున్న రాజకీయ, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగుతున్నప్పటికీ ఏడు ప్రధాన సూత్రాలపై రాజీ పడలేదని చెప్పారు.
లక్ష మంది సభ్యులతో ప్రారంభమైన జనసేనకు ప్రస్తుతం 20 లక్షలకుపైగా సభ్యత్వాలు ఉన్నాయని, ఇటీవల వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది పార్టీలో చేరుతున్నారని వెల్లడించారు. ప్రజల విశ్వాసమే పార్టీ బలమని పేర్కొన్నారు.
పార్టీ ప్రయోజనాల కంటే దేశ సమగ్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తామని, దేశ స్ఫూర్తిని కాపాడుకోవడం ప్రతి తరానికి బాధ్యత అని పవన్ అన్నారు. దేశభక్తి ఒకరోజు కార్యక్రమం కాదని, అది నిరంతర ప్రక్రియ అని వివరించారు.
తెలంగాణ ఏర్పాటుకు జనసేన ఎప్పుడూ వ్యతిరేకం కాదని, అయితే 2014లో రాష్ట్ర విభజన జరిగిన విధానంపై మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేశామని గుర్తుచేశారు. కాంగ్రెస్ వ్యవహరించిన తీరు ప్రజల్లో అసంతృప్తి, అశాంతికి కారణమైందని విమర్శించారు.రాజకీయ నాయకులు ఢిల్లీపై పెద్దపెద్ద వ్యాఖ్యలు చేస్తారని, కానీ అక్కడికి వెళ్లిన తర్వాత వెనక్కి తగ్గుతారని వ్యాఖ్యానించారు. ప్రతి వ్యక్తి సమాజంలో మార్పు తీసుకురాగలడని, చిన్న శక్తులు కూడా పెద్ద మార్పులకు కారణమవుతాయని పవన్ కల్యాణ్ అన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















