విజయవాడ నగర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే బైపాస్ ప్రాజెక్టు తుదిదశకు చేరుకుంది. కోల్కతా–చెన్నై నేషనల్ హైవే-16పై ప్రయాణించే వాహనాలు ఇకపై నగరంలోకి ప్రవేశించాల్సిన అవసరం లేకుండా ఈ బైపాస్ నెలాఖరుకు పూర్తిగా అందుబాటులోకి రానుంది.
మొత్తం 47 కి.మీ. పొడవున్న ఈ బైపాస్ను రెండు భాగాలుగా నిర్మించారు. చిన్నఅవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కి.మీ., గొల్లపూడి నుంచి కాజ వరకు 17 కి.మీ.గా పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం చిన్నఅవుటపల్లి వద్ద హైవేతో నేరుగా అనుసంధానం పనులు జరుగుతుండగా, తాత్కాలికంగా స్లిప్ రోడ్ ద్వారా వాహనాలను మళ్లిస్తున్నారు. అంబాపురం వద్ద హెచ్టీ విద్యుత్ లైన్ మార్పుపై ఎన్హెచ్ఏఐ మరియు ల్యాంకో పవర్ మధ్య వివాదం నెలకొనడంతో 90 మీటర్ల మేర వంతెన నిర్మాణం ఆగిపోయింది. అయినప్పటికీ మిగతా బైపాస్ మొత్తం అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంది.
గొల్లపూడి వద్ద విజయవాడ–హైదరాబాద్ హైవేపై సర్కిల్ నిర్మాణం జరుగుతోంది. ఇది బైపాస్ నుంచి అన్ని దిశలకు వాహనాల రాకపోకలకు అనుకూలంగా ఉంటుంది.ఇక వెదురుపావులూరు, వెంకటపాలెం వద్ద రెండు టోల్ప్లాజాలు సిద్ధమవుతున్నాయి. టోల్ గుత్తేదారుల ఎంపిక పూర్తయ్యాక ఏప్రిల్ 1 నుంచి టోల్ వసూలు ప్రారంభం కానుంది.మొత్తంగా ఈ బైపాస్ ప్రారంభంతో విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గే అవకాశం ఉంది
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APDevelopment APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu CricketFans CricketNews CrimeNews Entertainment Geopolitics Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews ViralNews WorldNews



















