టీ20 ప్రపంచకప్ ఫైనల్కు ముందు టీమ్ఇండియా బసలో కీలక మార్పు జరిగినట్లు సమాచారం. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే తుది పోరు రేపు (ఆదివారం) అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా బస చేసే హోటల్ను బీసీసీఐ చివరి నిమిషంలో మార్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. హోటల్ మార్పుకు గల కారణాలపై కూడా స్పష్టత లేదు.
మరోవైపు ఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు అహ్మదాబాద్కు భారీగా తరలివస్తున్నారు. టికెట్ల కోసం భారీ డిమాండ్ నెలకొనడంతో విమాన చార్జీలు కూడా పెరిగిపోయాయి. దీంతో అభిమానుల సౌకర్యార్థం పశ్చిమ రైల్వే ముంబయి నుంచి అహ్మదాబాద్కు ప్రత్యేక రైలును నడపాలని నిర్ణయించింది.
అదే విధంగా విమానయాన సంస్థలు కూడా అదనపు విమానాలను ప్రకటించాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఆకాశ ఎయిర్ వంటి సంస్థలు దేశంలోని పలు ప్రధాన నగరాల నుంచి అహ్మదాబాద్కు ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు వెల్లడించాయి. ముఖ్యంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్ వంటి నగరాల నుంచి అదనపు విమానాలు నడపనున్నట్లు తెలిపాయి.
మార్చి 8, 9 తేదీల్లో ముంబయి–అహ్మదాబాద్ మధ్య ప్రత్యేక విమానాలు నడపనున్నట్లు ఆకాశ ఎయిర్ ప్రకటించింది. టీమ్ఇండియాకు మద్దతుగా వేలాది మంది అభిమానులు నరేంద్రమోదీ స్టేడియానికి చేరుకునే అవకాశం ఉండటంతో అహ్మదాబాద్ నగరంలో ఇప్పటికే ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈ ఫైనల్ పోరులో టీమ్ఇండియా విజయం సాధించాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews APPolitics Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder Movies News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews



















