వృద్ధాప్యంలో మనవలు, మనవరాళ్లతో గడిపే సమయం కేవలం సరదా మాత్రమే కాదు, అది వారి మెదడుకు ఒక గొప్ప ‘కవచం’ లాంటిదని డెన్మార్క్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం వెల్లడించింది. వృద్ధుల్లో వచ్చే మతిమరుపు (Dementia), అల్జీమర్స్ వంటి సమస్యలను అరికట్టడంలో పిల్లల సాంగత్యం కీలక పాత్ర పోషిస్తుందని ఈ పరిశోధన స్పష్టం చేస్తోంది.
పరిశోధనలోని ఆసక్తికర అంశాలు:
జ్ఞాపకశక్తి పెరుగుదల: మనవలు, మనవరాళ్లతో సమయం గడిపే వృద్ధులు జ్ఞాపకశక్తి పరీక్షల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా విషయాలను గుర్తుంచుకోవడం, వేగంగా స్పందించడంలో వీరు ముందున్నారు.
భాషా పటిమ (Communication): పిల్లలతో మాట్లాడటం, వారికి కథలు చెప్పడం వల్ల వృద్ధుల్లో మాట తడబడటం తగ్గి, స్పష్టంగా, గలగలా మాట్లాడే శక్తి పెరుగుతుందని గుర్తించారు.
తక్కువ సమయం.. ఎక్కువ ప్రభావం: రోజంతా పిల్లలతో ఉండాల్సిన అవసరం లేదు. రోజులో కొద్దిసేపు వారి ఆలనాపాలన చూసినా, వారితో ఆడుకున్నా మెదడు చురుగ్గా మారుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
మానసిక ఉల్లాసం: ఒంటరితనం వల్ల వచ్చే డిప్రెషన్ తగ్గుతుంది. పిల్లల అమాయకత్వం, వారి ప్రశ్నలు వృద్ధుల మెదడుకు ఒక రకమైన వ్యాయామంలా (Mental Exercise) పనిచేస్తాయి.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















