ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా నియమితులైన మొజ్తాబా ఖమేనీ గాయపడ్డారన్న వార్తలను ఆ దేశ ప్రభుత్వం ఖండించింది. ఆయన ఆరోగ్యంగా, సురక్షితంగానే ఉన్నారని స్పష్టం చేసింది. ఇటీవల సోషల్ మీడియాలో, కొన్ని అంతర్జాతీయ మీడియా వేదికల్లో మొజ్తాబా ఖమేనీ గాయపడ్డారనే వార్తలు ప్రచారం కావడంతో ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కుమారుడు యూసఫ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మొజ్తాబా ఖమేనీ గాయపడ్డారన్న వార్తలు తన దృష్టికి వచ్చాయని, అయితే ఆయనతో టచ్లో ఉన్న స్నేహితులతో మాట్లాడినప్పుడు ఆయన క్షేమంగా, ఆరోగ్యంగానే ఉన్నారని వారు తెలిపినట్లు చెప్పారు.
ఇదిలా ఉండగా, అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్ ప్రారంభమైన తొలి రోజుల్లో మొజ్తాబా ఖమేనీ తన కుటుంబ సభ్యుల్లో పలువురిని కోల్పోయినట్లు ఆ దేశ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ దాడుల్లో ఆయన కూడా గాయపడ్డారని కొన్ని వర్గాలు ప్రచారం చేశాయి. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారికంగా ఎలాంటి వివరాలు వెలువడకపోవడంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ మొజ్తాబా ఖమేనీ బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడం కూడా ఈ ప్రచారాలకు కారణమైంది. ప్రజలను ఉద్దేశించి ఆయన నుంచి ఎలాంటి వీడియో సందేశం కూడా వెలువడకపోవడంతో సోషల్ మీడియాలో అనేక వాదనలు వినిపించాయి. అయితే తాజాగా ఇరాన్ అధ్యక్షుడి కుమారుడు చేసిన ప్రకటనతో మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై వచ్చిన అన్ని ఊహాగానాలకు చెక్ పడినట్లైంది. ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేయడంతో ఈ వార్తలకు తాత్కాలికంగా తెరపడింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















