జీవితంలో మనం సేకరించే జ్ఞాపకాలే భవిష్యత్తులో మనకు ఆనందాన్ని అందించే అసలైన సంపద. అలాంటి మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేసే కథతో తెరకెక్కిన సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’. నటుడు విరాజ్ అశ్విన్ కథానాయకుడిగా, వినోద్ గాలి దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ త్వరలో ETV Win వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సిరీస్లో యశశ్రీ రావు, రోహిణి హట్టంగడి, శివన్నారాయణ, ప్రియదర్శి రామ్ ముఖ్య పాత్రలు పోషించగా, శరత్ చంద్ర నాయుడు నిర్మించారు. విరాజ్ అశ్విన్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్లో ఈ సిరీస్ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత నవీన్ ఎర్నేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ప్రచార చిత్రం విడుదల అనంతరం నవీన్ ఎర్నేని మాట్లాడుతూ, ‘‘గత రెండేళ్లుగా ETV Win వరుస విజయాలతో ముందుకు సాగుతోంది. మేమంతా ఏడాదికి ఒక హిట్ కోసం కష్టపడుతుంటే, ఈ వేదిక మాత్రం ఒకేసారి మూడు నాలుగు హిట్లు ఇస్తోంది. ప్రతిభావంతులైన కొత్త సృష్టికర్తలకు ఇది మంచి వేదికగా మారింది’’ అని తెలిపారు.
హీరో విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ, ‘‘సంతోష్ అనే యువకుడు మరియు అతని స్నేహితుల జీవిత ప్రయాణమే ఈ కథ. అలాంటి కథను చెప్పడానికి ETV Win వంటి వేదిక దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం’’ అని చెప్పారు.
దర్శకుడు వినోద్ గాలి మాట్లాడుతూ, ‘‘మన జీవితంలో మరిచిపోయిన అనేక జ్ఞాపకాలను గుర్తు చేసే కథ ఇది. ఒక సంఘటన కారణంగా హీరో తన గతాన్ని మరిచిపోతాడు. కానీ నిజ జీవితంలో మనం కూడా అనుకోకుండా ఎంతో విలువైన సంబంధాలను మరిచిపోతున్నాం. మనకు నచ్చిన వారితో ఐదు నిమిషాలు మాట్లాడినా జీవితానికి కొత్త అర్థం వస్తుందని చెప్పే కథ ఇది’’ అని వివరించారు.
నిర్మాత శరత్ చంద్ర నాయుడు మాట్లాడుతూ, ‘‘మన జీవితంలో ఏదో కోల్పోతున్నామనే భావన తరచూ ఉంటుంది. ఈ సిరీస్ చూస్తున్నప్పుడు మనం ఏమి కోల్పోతున్నామో గుర్తుకు వస్తుంది. విరాజ్ నటన ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది’’ అన్నారు.
ETV Win బిజినెస్ హెడ్ సాయికృష్ణ మాట్లాడుతూ, ‘‘ఈ కథ జ్ఞాపకాలతో ముడిపడి ఉంటుంది. సిరీస్ చూస్తున్నప్పుడు ప్రేక్షకుల కళ్లలో ఆనందభాష్పాలు రావడం ఖాయం. వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంట్లో గడిపిన రోజుల్ని గుర్తు చేసే అనుభూతిని ఇది కలిగిస్తుంది’’ అని చెప్పారు.
ఇక కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి మాట్లాడుతూ, ‘‘సోషల్ మీడియాలో కనిపించే గందరగోళం అంతా కూడా సంతోష్ అనే పాత్రలో ప్రతిబింబిస్తుంది. మనకు ప్రియమైన వారిని జీవితం ఉన్నప్పుడే గుర్తు చేసుకుని మాట్లాడాలని చెప్పే భావోద్వేగ కథ ఇది’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో సిరీస్కు సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృందం సభ్యులు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. త్వరలో విడుదల కానున్న ‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్ ప్రేక్షకుల మనసులను తాకే భావోద్వేగ ప్రయాణంగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu Chandrababu naidu CricketNews CrimeNews Entertainment Geopolitics Government HealthyLifestyle India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews SportsNews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood WorldNews



















