వచ్చే ఏడాది జూన్లో జరగనున్న గోదావరి మహా పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, సాంకేతిక హంగులతో నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. రాజమహేంద్రవరంలోని ఎస్పీ కార్యాలయంలో డీజీపీ హరీష్కుమార్ గుప్తా ఆధ్వర్యంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పుష్కరాల భద్రత మరియు రద్దీ నియంత్రణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈసారి పుష్కరాల ప్రత్యేకత ఏంటంటే, కోట్లాదిగా తరలివచ్చే భక్తుల రద్దీని పర్యవేక్షించడానికి కృత్రిమ మేధ (AI – Artificial Intelligence) ఆధారిత ఆధునిక సాంకేతికతను వినియోగించబోతున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించడం, ట్రాఫిక్ మళ్లింపు, మరియు భద్రతా పరమైన అంశాలను ఏఐ సాంకేతికతతో రియల్ టైమ్లో విశ్లేషించనున్నారు. దీనికి తోడు నిరంతరం డ్రోన్ల ద్వారా గాలిలో నుంచి పర్యవేక్షణ కొనసాగుతుంది. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసేలా ఒకే చోట సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయనున్నారు.
భక్తుల సౌకర్యార్థం రాజమహేంద్రవరం, కొవ్వూరు పరిసరాల్లో భారీ సంఖ్యలో హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని డీజీపీ ఆదేశించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను నగరం బయటే నిలిపివేసి, అక్కడి నుంచి షటిల్ బస్సుల ద్వారా భక్తులను ఘాట్ల వద్దకు చేర్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ భారీ బందోబస్తు కోసం సుమారు 14,000 మంది పోలీసు సిబ్బందిని వినియోగించనున్నారు. రైళ్ల రాకపోకలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించి, భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా సమాచారాన్ని ఎప్పటికప్పుడు డ్రోన్లు మరియు మైకుల ద్వారా చేరవేసేలా యంత్రాంగం సిద్ధమవుతోంది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews APPolitics Breaking news BreakingNews Business BusinessNews ChandrababuNaidu CricketNews Crime Geopolitics Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi ShivasakthiDigital shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews TrendingNow ViralNews WorldNews

















