ప్రతిపాదిత ఉమ్మడి పౌరస్మృతి (UCC) గిరిజన సమాజంపై ఎలాంటి ప్రభావం చూపదని కేంద్ర హోం మంత్రి Amit Shah స్పష్టం చేశారు. గిరిజన వర్గాలకు ఎటువంటి నష్టం జరగదని ఆయన భరోసా ఇచ్చారు.
కొంతమంది ఈ అంశంపై తప్పుడు ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. అలాంటి వదంతులను నమ్మవద్దని గిరిజన సమాజాన్ని ఆయన కోరారు.
గిరిజన యోధుడు బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా దిల్లీలోని ఎర్రకోట మైదానంలో నిర్వహించిన ‘జనజాతి సాంస్కృతిక సమాగమం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని ఆరెస్సెస్ అనుబంధ ‘జనజాతి సురక్షా మంచ్’ నిర్వహించింది.యూసీసీ అమలు చేస్తున్న రాష్ట్రాల్లో గిరిజనులను దాని పరిధి నుంచి మినహాయించే ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని అమిత్ షా తెలిపారు. గిరిజనుల సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతి కాపాడబడతాయని ఆయన హామీ ఇచ్చారు. గిరిజనులపై బలవంతపు మతమార్పిడి చేయడానికి ఎవరికీ హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు.
అదే సమయంలో గిరిజన సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు రూ.28 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.1.54 లక్షల కోట్లకు పెంచిందని వివరించారు.ఈ సదస్సులో గిరిజనుల నుండి పలు డిమాండ్లు కూడా వినిపించాయి. ఇతర మతాల్లోకి మారిన వారిని ఎస్టీ కేటగిరీ నుంచి తొలగించాలని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 342ను సవరించాలని వారు కోరారు. దేశవ్యాప్తంగా సుమారు 500 తెగలకు చెందిన లక్షన్నర మంది గిరిజనులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















