రాజధాని అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు (ఆప్కాబ్) కోసం అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఐకానిక్ భవనం నిర్మాణం వేగంగా సాగుతోంది. సుమారు రూ.200 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ భవనం అమరావతి నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
లింగాయపాలెంలో సీఆర్డీఏ కేటాయించిన 0.495 ఎకరాల స్థలంలో జీ+17 అంతస్తులతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 2.09 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టులో భవన నిర్మాణానికి రూ.87 కోట్లు, ఇంటీరియర్ డిజైన్, ఆధునిక సౌకర్యాల కోసం మరో రూ.113 కోట్లు వెచ్చించనున్నారు.
ఆప్కాబ్ అనే పేరును ప్రతిబింబించేలా ప్రత్యేక శైలిలో భవన డిజైన్ రూపొందించారు. చివరి అంతస్తులో హెలిప్యాడ్ను ఏర్పాటు చేయడం ఈ నిర్మాణానికి మరింత ప్రత్యేకతను తీసుకురానుంది.
ఈ భవనంలో ఆప్కాబ్ ప్రధాన పాలనా కార్యాలయం, ఐటీ విభాగాలు, ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఛాంబర్లు, సమావేశ మందిరాలు, ఆధునిక కార్యాలయ వసతులు ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో నిర్మాణ పనులు చేపడుతున్నారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ఏపీఐఐసీకి అప్పగించగా, సాంకేతిక సహకారం కోసం ఐఐటీ హైదరాబాద్, విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సంస్థల సేవలను వినియోగిస్తున్నారు. రాజధాని అమరావతిలో ప్రభుత్వ, ఆర్థిక సంస్థల మౌలిక వసతుల అభివృద్ధికి ఈ భవనం మరో మైలురాయిగా నిలవనుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















