వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి మండలంలో ఒక భారీ ప్రమాదం తృటిలో తప్పింది. వీరన్నగట్టుపల్లె సమీపంలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన ‘పల్లెవెలుగు’ బస్సు ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సులో ఉన్న 21 మంది ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అప్రోచ్ రోడ్డుపై మట్టిని ఎత్తుగా పోయడమేనని తెలుస్తోంది. రోడ్డు ఎత్తు పెరగడంతో పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలు బస్సు పైభాగానికి తగిలి షార్ట్ సర్క్యూట్ సంభవించింది. క్షణాల్లో మంటలు వ్యాపించినప్పటికీ, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికులను వెంటనే కిందకు దించడంతో పెను ముప్పు తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. డ్రైవర్ సమయస్ఫూర్తిని, చాకచక్యాన్ని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. డ్రైవర్ తీసుకున్న సమయోచిత నిర్ణయం వల్లే 21 మంది ప్రాణాలు దక్కాయని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రోడ్ల నిర్వహణపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















