పోరంకిలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న మొల్లి పవన్కుమార్ (17) ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. తోటి విద్యార్థుల దాడులు, మానసిక వేధింపుల కారణంగానే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని దర్యాప్తులో తేలింది. పోలీసుల వివరాల ప్రకారం, పవన్కుమార్కు తోటి విద్యార్థి హేమంత్తో గత డిసెంబర్లో వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో హేమంత్తో మాట్లాడవద్దని పవన్కుమార్ కొందరు విద్యార్థులకు చెప్పడంతో, వారు అదే విషయాన్ని హేమంత్కు తెలియజేశారు. అనంతరం గత నెల 5న రాత్రి 11 గంటల సమయంలో పవన్కుమార్ను గదికి పిలిపించి కొట్టి, ఆ దృశ్యాలను వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.
గత నెల 31న మరోసారి పవన్కుమార్పై దాడి జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతి చెందే ముందు తనను కొట్టిన తోటి విద్యార్థుల పేర్లను ఎడమ చేతి అరచేతిపై రాసుకున్నాడు.అయితే ఈ విషయాన్ని గుర్తించిన కళాశాల యాజమాన్య ప్రతినిధులు, ప్రిన్సిపల్ సూచనల మేరకు ఆ పేర్లను తుడిచివేసి సాక్ష్యాలను ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.ఈ ఘటనపై లోతైన విచారణ చేపట్టిన పెనమలూరు పోలీసులు, ఆరుగురు విద్యార్థులతో పాటు ప్రిన్సిపల్ పిచ్చయ్య, ఫ్లోర్ ఇన్ఛార్జి రవీంద్ర, మెస్ పర్యవేక్షకులు హేమంత్, రాజేష్, జూనియర్ లెక్చరర్లు ఆనంద్, కృష్ణలను అరెస్టు చేశారు.
ఈ వివరాలను గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాస్, సీఐ వెంకటరమణ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ ఘటన విద్యార్థుల భద్రత, కళాశాల యాజమాన్య బాధ్యతలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.
Accident Andhra pradesh Andhrapradesh APNews Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu Cricket Crime News CrimeNews CrimeUpdate Devotion Devotional Government Health care Heavy rains Hyderabad India Mantha Toofan Movie Nara Lokesh Naralokesh News news update NewsUpdate PM Modi Police Politics Review Road accident shiavsakthinews shivasakthi net shivasakthinet shivasakthi news shiva sakthi news Sports SportsNews Stock Market Tdp Telangana TeluguNews today news Toofan Vijayawada



















