మే 15న లఖ్నవూ సూపర్ జెయింట్స్తో ఏకనా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్లో క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని ఆడతాడన్న వార్తలు తొలుత వినిపించాయి. జట్టుతో పాటు ధోని కూడా లఖ్నవూ వెళ్లినట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి. మోకాలి గాయం నుంచి కోలుకుని పూర్తిగా ఫిట్గా ఉన్నాడని, అతడి టికెట్ కూడా బుక్ అయిపోయిందని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ ఖరారు చేశారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ధోని ఈ మ్యాచ్లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. వరుసగా మూడు విజయాలతో ప్లేఆఫ్స్ రేసులో నిలిచిన చెన్నై, జట్టు కాంబినేషన్ను మార్చకూడదన్న వ్యూహంతో ఉన్నట్లు సమాచారం. ఈ కారణంగానే ధోనినే ఈ మ్యాచ్లో ఆడకుండా ఉండాలని నిర్ణయించుకున్నాడని సీఎస్కే వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు చెపాక్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో సొంత అభిమానుల మధ్య ధోని తన చివరి మ్యాచ్ ఆడేలా ప్రణాళికలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ కూడా క్రికెట్ వర్గాల్లో కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా చెన్నై సూపర్ కింగ్స్కు మరో షాక్ తగిలింది. జట్టు కీలక పేసర్ జేమీ ఓవర్టన్ గాయం కారణంగా మిగతా ఐపీఎల్ 2026 సీజన్కు దూరమయ్యాడు. అతడు స్వదేశానికి తిరిగి వెళ్లనున్నట్లు సీఎస్కే అధికారికంగా ప్రకటించింది.
11 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించిన చెన్నై, మిగిలిన మూడు మ్యాచ్ల్లో గెలిస్తే నాకౌట్ బెర్త్ ఖాయం చేసుకునే అవకాశంలో ఉంది. ఈ కీలక దశలో ఓవర్టన్ గైర్హాజరు జట్టుకు పెద్ద లోటుగా మారనుంది. ఈ సీజన్లో అతడు 14 వికెట్లు తీసి మిడిల్ ఓవర్లలో ప్రధాన బౌలర్గా నిలిచాడు. అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటారన్నది ఇంకా సీఎస్కే వెల్లడించలేదు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















