ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

రాజధానిలో సైబర్ నేరాల విపరీత పెరుగుదల.. ఆందోళనలో ప్రజలు

May 8, 2026
in Crime News, News
0
రాజధానిలో సైబర్ నేరాల విపరీత పెరుగుదల.. ఆందోళనలో ప్రజలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp

దేశంలోని ప్రధాన మహానగరాలతో పోటీపడుతూ హైదరాబాద్‌లో నేరాల సంఖ్య వేగంగా పెరుగుతున్నట్లు జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) 2024 నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా బాల నేరాలు, సైబర్‌ మోసాలు, ఆర్థిక నేరాలు, మహిళలపై వేధింపులు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయని నివేదిక వెల్లడించింది. కుటుంబ పర్యవేక్షణ లోపం, ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌లు, మత్తు పదార్థాల ప్రభావంతో చిన్నారులు నేరాల బాట పడుతున్నారనే విషయం మరింత కలవరపెడుతోంది.

బాల్యం గాడితప్పుతోంది..

తెలిసీతెలియని వయసులోనే కొంతమంది బాలలు స్నాచింగ్‌లు, దొంగతనాలు, డ్రగ్‌ స్మగ్లింగ్‌లాంటి నేరాలకు పాల్పడుతున్నారు. చిన్ననేరాలతో ప్రారంభమైన ఈ ప్రయాణం హత్యలు, అత్యాచారాల వరకు వెళ్లడం పోలీసులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది. 2023లో హైదరాబాద్‌లో జువెనైల్‌ నేరాలకు సంబంధించిన 180 కేసులు నమోదుకాగా.. 2024 నాటికి అవి 316కి పెరగడం తీవ్ర పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. వీరిలో ఎక్కువమంది 12-14 ఏళ్ల వయస్సు గల వారే కావడం గమనార్హం. తల్లిదండ్రులకు దూరంగా ఉండే పిల్లలే అధికంగా నేరాలకు పాల్పడుతున్నట్లు నివేదిక పేర్కొంది.

ఆర్థిక మోసాలు.. సైబర్‌ మాయలు

తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయన్న ఆశతో అమాయక ప్రజలు మోసగాళ్ల బారిన పడుతున్నారు. సొంతిల్లు, వ్యాపార భాగస్వామ్యం, తక్కువ ధరకు బంగారం వంటి పేర్లతో కోట్ల రూపాయలు దోచుకుంటున్న సైబర్‌ కేటుగాళ్లు రాజధానిలో విస్తరిస్తున్నారు. 2024లో 7,771 ఆర్థిక నేరాల కేసులతో ముంబయి దేశంలో మొదటి స్థానంలో ఉండగా.. హైదరాబాద్‌ రెండో స్థానంలో నిలిచింది. సైబర్‌ నేరాల్లో 4,009 కేసులతో దేశంలో మూడో స్థానంలో ఉంది.

నేరాలు పెరిగినా.. ఛార్జిషీట్లు తక్కువ

హైదరాబాద్‌లో 2023తో పోలిస్తే 2024లో మొత్తం నేరాల సంఖ్య 21.54 శాతం పెరిగింది. 2023లో 21,774 కేసులు నమోదవగా.. 2024లో అవి 27,031కు చేరాయి. దేశంలోని 19 ప్రధాన నగరాల్లో హైదరాబాద్‌ ఐదో స్థానంలో నిలిచింది. అయితే కేసులు భారీగా నమోదవుతున్నప్పటికీ.. దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్లు దాఖలు చేయడంలో మాత్రం పోలీసులు వెనుకబడినట్లు నివేదిక తెలిపింది. నమోదైన కేసుల్లో కేవలం 56.9 శాతం కేసులకే ఛార్జిషీట్లు దాఖలు కావడం ఆందోళన కలిగిస్తోంది.

మహిళలు, చిన్నారులపై వేధింపులు

రాజధానిలో మహిళలు, చిన్నారులు బహిరంగ ప్రదేశాలు, ప్రజారవాణా వ్యవస్థల్లోనే అధికంగా వేధింపులకు గురవుతున్నట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. 2024లో నమోదైన 149 లైంగిక వేధింపుల కేసుల్లో 77 కేసులు బహిరంగ ప్రదేశాలు, బస్సులు, కార్యాలయాల్లో జరిగినవేనని పేర్కొంది. అదే ఏడాది హైదరాబాద్‌లో 358 అత్యాచార కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా దిల్లీ మొదటి స్థానంలో ఉండగా.. హైదరాబాద్‌ కూడా ఆందోళనకర స్థాయిలో కేసులతో ముందువరుసలో నిలిచింది.

వదంతులు, తప్పుడు వార్తల్లో తొలి స్థానం

సోషల్‌ మీడియా వేదికగా వదంతులు, తప్పుడు వార్తల వ్యాప్తిలో హైదరాబాద్‌ దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం మరో ఆందోళనకర అంశంగా మారింది. 2024లో ఇలాంటి 68 కేసులు నమోదయ్యాయి. అలాగే ఫోర్జరీ, మోసం, నమ్మకద్రోహం కేసుల్లో 5,679 కేసులతో హైదరాబాద్‌ దేశంలో రెండో స్థానంలో ఉంది.

దొంగతనాల్లోనూ పెరుగుదల

నగరంలో 2024లో మొత్తం 4,875 దొంగతనాల కేసులు నమోదయ్యాయి. వీటిలో 2,234 వాహనాల చోరీలకు సంబంధించినవే. బందిపోటు తరహా దొంగతనాలు బెంగళూరుకు తర్వాత హైదరాబాద్‌లోనే అధికంగా నమోదవుతున్నాయని నివేదిక పేర్కొంది.

ఈ గణాంకాలు రాజధానిలో పెరుగుతున్న నేర పరిస్థితులను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. కుటుంబ విలువలు, పర్యవేక్షణ, డిజిటల్‌ అవగాహన, పోలీసు వ్యవస్థలో వేగవంతమైన దర్యాప్తు వంటి అంశాలపై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews ShivaShaktiUpdates SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews

Tags: BreakingNewsCapitalCityCrimeNewsCrimeUpdateCyberAlertCyberCrimeCyberFraudCyberSafetyDigitalFraudInternetSafetyLatestNewsOnlineScamPublicAwarenessPublicConcernshivasakthimediaTechCrime
ShareTweetSend
Previous Post

ఈరోజు బంగారం – వెండి ధరలు(08-05-2026)

Next Post

ఏపీని ఏరోస్పేస్‌, డ్రోన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం

Related Posts

బీసీసీఐ హెచ్చరిక.. హనీట్రాప్‌లపై క్రికెటర్లకు అలర్ట్
Sports News

బీసీసీఐ హెచ్చరిక.. హనీట్రాప్‌లపై క్రికెటర్లకు అలర్ట్

May 8, 2026
స్కోడా విక్రయాల్లో 11% వాటా తెలుగు రాష్ట్రాలదే
Business News

స్కోడా విక్రయాల్లో 11% వాటా తెలుగు రాష్ట్రాలదే

May 8, 2026
వృద్ధి పథంలో సంస్థ.. రూ.4,000 కోట్ల లక్ష్యం
Business News

వృద్ధి పథంలో సంస్థ.. రూ.4,000 కోట్ల లక్ష్యం

May 8, 2026
గుకేశ్‌ గేమ్‌ డ్రా
Sports News

గుకేశ్‌ గేమ్‌ డ్రా

May 8, 2026
ఈసీఎల్‌జీఎస్‌ 5.0తో భారీ రుణాల లక్ష్యం.. ఎస్‌బీఐ ప్రకటన
Business News

ఈసీఎల్‌జీఎస్‌ 5.0తో భారీ రుణాల లక్ష్యం.. ఎస్‌బీఐ ప్రకటన

May 8, 2026
సూర్యకుమార్ యాదవ్ తండ్రిగా మారారు.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన దేవిషా శెట్టి
Sports News

సూర్యకుమార్ యాదవ్ తండ్రిగా మారారు.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన దేవిషా శెట్టి

May 8, 2026
Next Post
ఏపీని ఏరోస్పేస్‌, డ్రోన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం

ఏపీని ఏరోస్పేస్‌, డ్రోన్ హబ్‌గా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

May 8, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
పంచాంగం: 08 మే 2026 (శుక్రవారం)

పంచాంగం: 08 మే 2026 (శుక్రవారం)

May 8, 2026
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

ఏపీలో రహదారుల అభివృద్ధికి మహర్దశ: ₹8,000 కోట్లతో భారీ ప్రణాళికలు ప్రకటించిన సీఎం చంద్రబాబు

1
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
స్కోడా విక్రయాల్లో 11% వాటా తెలుగు రాష్ట్రాలదే

స్కోడా విక్రయాల్లో 11% వాటా తెలుగు రాష్ట్రాలదే

May 8, 2026
వృద్ధి పథంలో సంస్థ.. రూ.4,000 కోట్ల లక్ష్యం

వృద్ధి పథంలో సంస్థ.. రూ.4,000 కోట్ల లక్ష్యం

May 8, 2026
గుకేశ్‌ గేమ్‌ డ్రా

గుకేశ్‌ గేమ్‌ డ్రా

May 8, 2026
ఈసీఎల్‌జీఎస్‌ 5.0తో భారీ రుణాల లక్ష్యం.. ఎస్‌బీఐ ప్రకటన

ఈసీఎల్‌జీఎస్‌ 5.0తో భారీ రుణాల లక్ష్యం.. ఎస్‌బీఐ ప్రకటన

May 8, 2026

Recent News

స్కోడా విక్రయాల్లో 11% వాటా తెలుగు రాష్ట్రాలదే

స్కోడా విక్రయాల్లో 11% వాటా తెలుగు రాష్ట్రాలదే

May 8, 2026
వృద్ధి పథంలో సంస్థ.. రూ.4,000 కోట్ల లక్ష్యం

వృద్ధి పథంలో సంస్థ.. రూ.4,000 కోట్ల లక్ష్యం

May 8, 2026
గుకేశ్‌ గేమ్‌ డ్రా

గుకేశ్‌ గేమ్‌ డ్రా

May 8, 2026
ఈసీఎల్‌జీఎస్‌ 5.0తో భారీ రుణాల లక్ష్యం.. ఎస్‌బీఐ ప్రకటన

ఈసీఎల్‌జీఎస్‌ 5.0తో భారీ రుణాల లక్ష్యం.. ఎస్‌బీఐ ప్రకటన

May 8, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

స్కోడా విక్రయాల్లో 11% వాటా తెలుగు రాష్ట్రాలదే

స్కోడా విక్రయాల్లో 11% వాటా తెలుగు రాష్ట్రాలదే

May 8, 2026
వృద్ధి పథంలో సంస్థ.. రూ.4,000 కోట్ల లక్ష్యం

వృద్ధి పథంలో సంస్థ.. రూ.4,000 కోట్ల లక్ష్యం

May 8, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.