ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో ఎలక్ట్రిక్ సైకిల్పై ప్రత్యేక పర్యటన నిర్వహించారు. సాధారణ ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు, ఇంధన వినియోగాన్ని తగ్గించే ప్రత్యామ్నాయ మార్గాలపై అవగాహన కల్పించారు.
రైతు బజార్ను సందర్శించిన మంత్రి అక్కడి వ్యాపారులు, కొనుగోలుదారులతో మాట్లాడి విద్యుత్ ఆధారిత వాహనాల వినియోగం పెంచాల్సిన అవసరాన్ని వివరించారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రయాణికులతో ముచ్చటిస్తూ పెరుగుతున్న ఇంధన ధరలు, కాలుష్య సమస్యలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగమే భవిష్యత్తుకు సరైన మార్గమని మంత్రి పేర్కొన్నారు. పర్యావరణ హిత జీవనశైలి అలవరుచుకుంటేనే భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించగలమన్నారు.
అలాగే పరిశుభ్రత విషయంలో ప్రజలు నిబద్ధతతో ఉండాలని, స్వచ్ఛమైన గ్రామాలు – పరిశుభ్రమైన పట్టణాల ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం చేపడుతున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు మరింత విజయవంతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.ఎలక్ట్రిక్ సైకిల్పై మంత్రి చేసిన ఈ పర్యటన స్థానిక ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించగా, యువత కూడా గ్రీన్ ఎనర్జీ వినియోగంపై ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















